మే 5న ‘యాద్గిరి అండ్ సన్స్’ రిలీజ్

మే 5న ‘యాద్గిరి అండ్ సన్స్’ రిలీజ్

అనిరుధ్, యశస్విని జంటగా భిక్షపతి రాజు పందిరి దర్శకత్వంలో చంద్రకళ పందిరి నిర్మించిన చిత్రం ‘యాద్గిరి అండ్ సన్స్’. ఈ మూవీని మే 5న రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. ఈ సంద్భరంగా  దర్శకుడు మాట్లాడుతూ ‘ఇది ఒక రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా రూపొందిన చిత్రం. ఇందులోని పాత్రలు కూడా నేచురల్‌‌‌‌గా ఉంటాయి.

హీరో హీరోయిన్‌‌‌‌తో పాటు సీనియర్ ఆర్టిస్టులు జీవా, రాజీవ్ కనకాల యాక్టింగ్ ఆకట్టుకుంటుంది. మార్తాండ్. కె. వెంకటేష్‌‌‌‌ ఎడిటింగ్ సినిమాకి హైలైట్. పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తయ్యాయి. ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అన్నారు.