
‘కేజీయఫ్’ ఫ్రాంచైజీతో పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన కన్నడ హీరో యశ్.. ప్రస్తుతం ‘టాక్సిక్’ చిత్రంలో నటిస్తున్నాడు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీ కీలక షెడ్యూల్ను రీసెంట్గా ముంబైలో పూర్తి చేశారు. 45రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్లో హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ జె.జె.పెర్రీ ఆధ్వర్యంలో భారీ యాక్షన్ సీక్వెన్స్ను చిత్రీకరించారు. త్వరలోనే ఫైనల్ షెడ్యూల్ను బెంగళూరులో స్టార్ట్ చేయనున్నట్టు మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ఈ షెడ్యూల్తో దాదాపు టాకీ పార్ట్ పూర్తవుతుందని తెలియజేశారు.
ఇందులో నయనతార, కియారా అద్వాని, హ్యూమా ఖురేషి, తారా సుతైరా హీరోయిన్స్గా నటిస్తున్నట్టు ప్రచారంలో ఉంది. కానీ ఇప్పటివరకు హీరోయిన్స్ గురించి ఎలాంటి ప్రకటన టీమ్ నుంచి రాలేదు. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యశ్ కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. మార్చి 19న వరల్డ్వైడ్గా సినిమా విడుదల కానుంది. ఈమూవీపై ఇప్పటికే అంచనాలు ఏర్పడ్డాయి.