టీడీపీ ప్రభుత్వం దోచుకుంటే.. సంక్షేమంలో వైసీపీ ప్రభుత్వం ముందంజ

టీడీపీ ప్రభుత్వం దోచుకుంటే..  సంక్షేమంలో వైసీపీ ప్రభుత్వం ముందంజ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొత్త శకానికి నాంది పలికారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ‍స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని వ్యవస్థ ఏపీలో అమలవుతుందన్నారు సజ్జల. అర్హత ఉన్న వారందరికీ సంక్షేమ పథకాలు అందేలా వైసీపీ ప్రభుత్వం ప్రజల దగ్గరకే పాలకులు వచ్చేలా జగన్ చర్యలు తీసుకున్నారన్నారు.  జగనన్న సురక్షా కార్యక్రమం విజయవంతం అయిందన్న  సజ్జల...అవినీతికి అవకాశం లేకుండా ప్రభుత్వ పథకాలను వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే సంక్షేమ ఫలాలు అందేలా పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు.  జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవస్థ వల్ల  వరద బాధితులకు సత్వరమే సాయం అందుతోందన్నారు.  

టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు చేసిన హడావిడి... వైసీపీ ప్రభుత్వం చేయదంటూ.. బాధితులకు నేరుగా సాయం అందిస్తు్న్నామన్నారు.  టీడీపీ ప్రభుత్వంలో బడా నేతలకు ప్రభుత్వ ఖజానాను దోచిపెడితే .. జగన్ ప్రభుత్వం అమరావతిలో పేద ప్రజలకు ఇళ్లు కట్టిస్తు్ందన్నారు సజ్జల.