విశాఖ ప్రమాదంపై ఏపీ ప్రభుత్వం సీరియస్

విశాఖ ప్రమాదంపై ఏపీ ప్రభుత్వం సీరియస్

విశాఖ ఆటో ప్రమాదం పై ప్రభుత్వం సీరియస్ అయింది.  ఆటో డ్రైవర్ అతివేగం వల్లే  ప్రమాదం జరిగిందని  ఆటో డ్రైవర్ పై కేసు నమోదు చేశారు.  ఈ ప్రమాదం జరిగిన పిల్లలకు  చికిత్స ఖర్చు ప్రభుత్వమే  భరిస్తుందని వైఎస్ఆర్సిపి నేత వైవి సుబ్బారెడ్డి ప్రకటించారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. 

విశాఖపట్నంలో బుధవారం  ( నవంబర్ 22)  ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నగరంలోని సంగం-శరత్‌ థియేటర్‌ దగ్గర లారీ, ఆటో ఢీకొన్న ఘటనలో గాయపడిర  విద్యార్ధులకు తీవ్ర గాయాలు కాగా.. ఒకరి పరిస్థితి విషంగా ఉంది. రోడ్డు దాటే క్రమంలో ఓ ఆటో డ్రైవర్‌ నిర్లక్ష్యం.. స్కూల్‌ విద్యార్ధుల ప్రాణాల మీదకు తెచ్చింది.   ఈ ప్రమాదంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది.  ఈ ప్రమాదంలో గాయపడిన వారి చికిత్స ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని వైఎస్సార్సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. 

జంక్షన్‌లో‌ స్పీడ్‌గా వస్తున్న లారీని గమనించకుండా.. వేగంగా రోడ్డు దాటే ప్రయత్నం చేశాడు ఆటో డ్రైవర్‌. దీంతో ఆటో వెళ్లి లారీని ఢీకొని పల్టీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో 8 మంది విద్యార్ధులు ఉన్నారు. రోడ్డుపక్కన ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో ప్రమాదం దృశ్యాలు రికార్డయ్యాయి. ప్రమాదంలో ఆటో డ్రైవర్‌ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. సమయం దాటిన తర్వాత లారీ రోడ్డుపైకి రావడం నిబంధన ఉల్లంఘన కాగా..ఆటో డ్రైవర్ వేగం కూడా ప్రమాదానికి కారణంగా కనిపిస్తోంది. ప్రమాదం దృశ్యాలు చాలా హృదయవిదారకంగా ఉన్నాయి. రక్తం కారుతున్న గాయాలతో పిల్లలు బోరున ఏడుస్తూ రోడ్డుపై పడి ఉండటం చూసిన వారి హృదయాలు చలించిపోయాయి.. ఈ ప్రమాదంలో ఏడుగురు  పిల్లలు గాయపడ్డారు.

కాగా.. ఈ ఘటనపై డీసీపీ శ్రీనివాసరావు మాట్లాడారు. డ్రైవర్‌ని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. క్షతగాత్రుల్లో .. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ఆటోలో పరిమితికి మించి విద్యార్థులు ఉన్నారని.. ఇది కూడా ప్రమాదానికి కారణమైందని శ్రీనివాసరావు తెలిపారు. ఆటోలో పిల్లలను పంపే తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని.. చివరి నిమిషంలో వేగంగా వెళ్లడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని డీసీపీ వివరించారు.