న్యూఢిల్లీ, వెలుగు: ఒలింపిక్స్లో దొంగఓట్ల నమోదు పోటీ ఉంటే చంద్రబాబు విజేత అవుతారని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. దొంగ ఓట్ల నమోదులో చంద్రబాబు వరల్డ్ నంబర్ వన్, వరల్డ్ ఛాంపియన్ అని ఎద్దేవా చేశారు. సోమవారం చంద్రబాబు సీఈసీని కలిసిన తర్వాత విజయసాయి రెడ్డి సైతం ఎన్నికల సంఘం అధికారులను కలిశారు.
ఈ సందర్భంగా ఏపీలో ఎన్నికల సంఘం నిర్వహిస్తోన్న అంశాలను వివరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అన్ని అంశాలను సీఈసీ దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. ఆయా అంశాలను పరిశీలిస్తామని అధికారులు హామీ ఇచ్చారని చెప్పారు. చంద్రబాబు హయాంలో ఎలా ఓటర్ల జాబితా తారుమారు చేశారన్నది ఈసీకి తెలిపామన్నారు.