చిరంజీవి..వైజాగ్ లో ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉండు:విజయ సాయి రెడ్డి

చిరంజీవి..వైజాగ్ లో ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉండు:విజయ సాయి రెడ్డి

వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి చేసిన ప్రకటనపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. చిరు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. వైజాగ్ లో ఇల్లు కట్టుకుని అక్కడే స్థిరపడుతానంటూ వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి కామెంట్ చేశారు. ఏపీ కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నంలో స్థిరపడాలని మెగాస్టార్‌ తీసుకున్న నిర్ణయాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్లు చెప్పారు. త్వరలో రిలీజ్ కాబోయే వాల్తేరు వీరయ్య  చిత్రం గ్రాండ్ సక్సెస్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను"  అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. 

(ఆదివారం ) విశాఖ ఆర్కే బీచ్ లో జరిగిన వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ఈవెంట్లో చిరంజీవి మాట్లాడుతూ తనకు వైజాగ్లో సెటిల్ అవ్వాలని ఉందన్నారు. ఇక్కడి ప్రజలు కుళ్లూకుతంత్రాలకు తావు ఇవ్వరన్నారు. ఇక్కడ కాస్మోపాలిటన్ కల్చర్ కనిపిస్తుందన్న చిరు..ఈ మధ్యే వైజాగ్లో ఓ స్ధలం కూడా తీసుకున్నానని చెప్పారు. ఇక ఇల్లు కట్టుకునే ప్రయత్నం మొదలుపెట్టాలని అన్నారు. అదే తన చిరకాల కోరిక అని చెప్పారు. వైజాగ్ ఎప్పుడొచ్చిన సరే తన అనందానికి అవధులుండవని చెప్పారు. 

బాబీ డైరెక్షన్లో తెరకెక్కన వాల్తేరు వీరయ్య చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ అవుతోంది. ఇందులో చిరంజీవి సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. రవితేజ, కేథరిన్ కీలక పాత్రలో  నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఇటీవలె రిలీజైన ఈ మూవీ ట్రైలర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. గాడ్ ఫాదర్ తర్వాత చిరు నటిస్తున్న మూవీ కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.