
- తప్పు చేస్తే ప్రధాని అయినా విచారణకు రావాలి: యెన్నం
హైదరాబాద్, వెలుగు: కేసీఆర్కు నోటీసులిస్తే తెలంగాణ ప్రజలకు నోటీసులిచ్చినట్లేనని కవిత అంటున్నారని, మరి కవిత ఇల్లు కట్టుకుంటే తెలంగాణ ప్రజలకు ఇండ్లు లేవు కదా? అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. ‘కక్షగట్టి ఈటల రాజేందర్కు నోటీసులిచ్చారని బీజేపీ లీడర్లు అంటున్నరు.
తప్పు చేస్తే ప్రధాని అయినా విచారణకు హాజరుకావాల్సిందే’’ అని అన్నారు. గాంధీభవన్లో శుక్రవారం మీడియాతో యెన్నం మాట్లాడారు. కాళేశ్వరం ఖర్చు రూ.1.20 లక్షల కోట్లకు ఎందుకు పెరిగిందని, డీపీఆర్ కోసం వ్యాప్కోస్ సంస్థకు రూ.5.38 కోట్లు చెల్లించారా? అని ఈటలను కమిషన్ ప్రశ్నిస్తే.. ఆయన తనకేం తెలియదని చెప్పారు. దాన్ని బట్టి చూస్తే.. ప్రాజెక్ట్ నిర్మాణమంతా కేసీఆర్ కనుసన్నల్లోనే జరిగిందని అర్థమవుతున్నది.