మన్యంకొండ బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేయాలి : యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మన్యంకొండ బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేయాలి : యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: ఈ నెల19 నుంచి మార్చి 27  వరకు నిర్వహించనున్న మన్యంకొండ  శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి కోరారు.  శుక్రవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆయన కలెక్టర్ జి .రవి నాయక్ తో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.  

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతేడాది  కంటే ఎక్కువ మంది భక్తులు ఈ సారి రావొచ్చన్నారు. మహిళలకు ప్రవేశపెట్టిన ఉచిత బస్సు సౌకర్యం వల్ల ఎక్కువమంది వస్తారని, అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని కోరారు.  కలెక్టర్ జి. రవి నాయక్ మాట్లాడుతూ..  బ్రహ్మోత్సవాల్లో  భాగంగా ఫిబ్రవరి 24న స్వామి వారి గరుడ వాహన సేవ, రథోత్సవం మార్చి 25న అలివేలు మంగతాయారు తిరుకల్యాణోత్సవం, రాత్రి రథోత్సవం ఉంటాయన్నారు.  అడిషనల్ కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, ఎస్ .మోహన్ రావు తదితర అధికారులు పాల్గొన్నారు.