పెండ్లయిన తెల్లారే చనిపోయిండు

పెండ్లయిన తెల్లారే చనిపోయిండు

బోధన్​, వెలుగు: పెండ్లయిన కొన్ని గంటలకే గుండెనొప్పితో పెండ్లికొడుకు చనిపోయాడు. నిజామాబాద్​ జిల్లా బోధన్​ పట్టణం నాయీ బ్రాహ్మణగల్లికి చెందిన చందూర్​ గణేష్​ పెండ్లి సాలూర గ్రామానికి చెందిన స్వప్నతో శుక్రవారం జరిగింది. సాయంత్రం 5 నుంచి రాత్రి 2 వరకు కాలనీల్లో డీజేతో బారాత్​ నిర్వహించారు. స్నేహితులు, బంధువులతో కలిసి పెండ్లికొడుకు డ్యాన్స్​ చేశాడు. బారాత్​ పూర్తయిన తర్వాత గణేష్​ చాతిలో నొప్పి వస్తుందని చెప్పాడు. వెంటనే నిజామాబాద్​కు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు.

మరిన్ని వార్తల కోసం