దళితుల గురించి మాట్లాడే హక్కు మీకు లేదు.. బీఆర్ఎస్ పై అద్దంకి ఫైర్

దళితుల గురించి మాట్లాడే హక్కు మీకు లేదు.. బీఆర్ఎస్ పై అద్దంకి ఫైర్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని దళితుల గురించి బీఆర్ఎస్ మాట్లాడుతుంటే విడ్డూరంగా ఉందని కాంగ్రెస్  ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్  అన్నారు. దళితుల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదని శుక్రవారం ఓ ప్రకటనలో ఆయన మండిపడ్డారు. 

దళితులకు ఇచ్చిన హమీలను బీఆర్ఎస్  ఎలా తుంగలో తొక్కింది, వారి సంక్షేమం కోసం కేటాయించిన నిధులను ఎట్లా దారి మళ్లించిందనే దానిపై ఒకసారి ఆ పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. దళితులకు బీఆర్ఎస్  చేసిన ద్రోహం, వారిపై చేసిన దాడులు, విధ్వంసాన్ని జనం ఇంకా మరిచిపోలేదన్నారు.