
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు కూడా విరుచుకుపడుతున్నారు. తాజాగా నిస్సార రాజకీయాలు చేయొద్దంటూ రాహుల్పై హోం మినిస్టర్ అమిత్ షా అటాక్ చేశారు. రాహుల్ గాంధీని ఉద్దేశించి.. ‘ఇండియా వ్యతిరేక ప్రచారాన్ని మేం సమర్థంగా తిప్పికొట్టగలం. అయితే అతి పెద్ద పొలిటికల్ పార్టీకి మాజీ ప్రెసిడెంట్ అయి ఉండి ఇలాంటి నిస్సార రాజకీయాలు చేసినప్పుడు బాధాకరంగా ఉంటుంది’ అని షా మండిపడ్డారు.
‘చైనా, పాకిస్తాన్లు రాహుల్ హ్యాష్ట్యాగ్ను ముందు తీసుకెళ్తున్నాయి. రాహుల్తోపాటు కాంగ్రెస్ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన తరుణమిది. ఇది నా కోసం కాదు. తమ లీడర్ను పాక్, చైనాలు ప్రోత్సహిస్తున్నాయని కాంగ్రెస్ గ్రహించాలి. ఈ విపత్కర సమయంలో చైనా, పాకిస్థాన్ ఏం ఇష్టపడతాయో మీరు అవే చెబుతున్నారు. అడ్వాణీ తర్వాత రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ బీజేపీ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇప్పుడు నడ్డా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన వారెవరైనా ఉన్నారా? ఇందిర తర్వాత గాంధీ కుటుంబం నుంచి కాక కాంగ్రెస్ ప్రెసిడెంట్గా వ్యవహరించిన బయటి వ్యక్తి పేరు చెప్పండి? ఏ ప్రజాస్వామ్యం గురించి మీరు మాట్లాడుతున్నారు?’ అని షా దుయ్యబట్టారు.