- సూపర్ మనీ రిపోర్ట్ వెల్లడి
- తిండి కోసం ఎక్కువ ఖర్చు
యువత కొనుగోళ్లు ప్లాన్ ప్రకారం ఉంటున్నాయి. అర్ధరాత్రి నుంచి ఉదయం 6 గంటల వరకు ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లు ఎక్కువగా ఉంటున్నాయి. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు కిరాణా, సూపర్ మార్కెట్ కొనుగోళ్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పెద్ద నగరాల్లో ఉదయం కిరాణా షాపింగ్ ఎక్కువగా జరుగుతోంది. శుక్రవారం సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల మధ్య అత్యధిక లావాదేవీలు జరుగుతున్నాయి.
యువత ఈ సమయంలో ఆహారం, వినోదం కోసం ఖర్చు చేస్తూ ఆనందిస్తున్నారు. ఈ యూపీఐ పెరుగుదల కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాలేదు. టైర్ 2, టైర్ 4 నగరాల వాటా ఇప్పుడు మొత్తం 41 శాతానికి పైగా ఉంది. అప్పుల కోసం ఎక్కువ మంది యువతీ యువకులు ఫిక్స్డ్ డిపాజిట్ఆధారిత సెక్యూర్డ్ కార్డులను వాడుతున్నారని సూపర్మనీ రిపోర్ట్ వివరించింది.
