పెళ్లికి పెద్దలు ఒప్పుకోరేమోనని యువజంట ఆత్మహత్య

పెళ్లికి పెద్దలు ఒప్పుకోరేమోనని యువజంట ఆత్మహత్య
  • రైలు పట్టాలపై పడి ఉన్న యువతీ యువకుల మృతదేహాలు
  • హత్యలా..? లేక ఆత్మహత్యా..?

ప్రకాశం జిల్లా: రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం దేశాయిపేట విఘ్నేశ్వర కాలనీ దగ్గర రైలు పట్టాలపై ఇద్దరి మృతదేహాలను చూసి స్థానికులు  భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. చనిపోయిన ఇద్దరు దేశాయిపేటకు చెందిన సాయి సతీష్, షకీనాగా గుర్తించారు. వీరిద్దరూ కొంత కాలంగా ప్రేమిచుంకుంటున్నట్లు సమాచారం. లేత వయసులో ఉన్న ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా సంచలనం రేపింది. తమ కులాలు మతాలు వేరువేరు కావడంతో పెళ్లికి పెద్దలు ఒప్పుకోరనే భయంతో ప్రాణాలు తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు.  పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఏపీ ఎన్నికల సిబ్బందికి ఒక్కో జిల్లాలో ఒక్కో రెమ్యూనరేషన్

వీ6 చానెల్ డిబేట్‌పై స్పందించిన మంత్రి ఎర్రబెల్లి

వాహనదారులపై పెట్రో బాంబ్.. లీటర్ ధర 92కు చేరువ

ఇల్లు కట్టుకోవడానికి సరైన​ టైమ్​ ఇదే!