
కోనరావుపేట, వెలుగు: రైతుల పట్ల సెస్ అధికారులు దురుసు ప్రవర్తనపై ఓ యువ రైతు ఎక్స్(ట్విట్టర్)లో సీఎంకు ఫిర్యాదు చేశాడు. కోనరావుపేట మండలం కొలనూర్ గ్రామంలో సెస్ అధికారులు రైతులకు సమాచారం ఇవ్వకుండా పొలాల వద్ద స్టార్టర్లను తీసుకెళ్లారు.
దీనిపై లైన్మెన్ను ప్రశ్నించగా ఉన్నతాధికారులు తీసుకురమ్మాన్నారని, ఎవరు చెప్పినా వినేది లేదని రైతులతో దురుసుగా ప్రవర్తించాడు. దీనిని ఓ యువరైతు వీడియో తీసి ఎక్స్లో సీఎంకు పోస్ట్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో గురువారం మండలంలో వైరల్ అయింది.