ప్రతి నెల మన్ కీ బాత్ కార్యక్రమంలో పలువురు వ్యక్తుల గురించే మాట్లాడే ప్రధాని మోదీ.. 2023 సెప్టెంబర్ 24 న హైదరాబాద్ విద్యార్థినిపై ప్రశంసలు కురింపించారు. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కు చెందిన 7వ తరగతి విద్యార్థిని ఆకర్షణ సతీష్ చేసిన కృషిని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు.
పుస్తక పఠనంపై ఉన్న ఆసక్తితో ఇతరులను కూడా చదివించాలని ఆకర్షణ ప్రయత్నిస్తోంది. తన తండ్రి డా. సతీశ్ కుమార్ ప్రోత్సాహంతో పుస్తకాలను సేకరించడం అలవాటుగా చేసుకుంది. అంతేకాకుండా ఆసుపత్రి అధికారుల అనుమతితో ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో, పలు ప్రాంతాల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేసింది.
హైదరాబాద్లోని 7 లైబ్రరీల కోసం ఆమె 5800 పాత పుస్తకాలను సేకరించగలిగింది. చిన్న వయసులో తన వంతు కృషి చేస్తున్నందుకు గానూ మోదీ అకర్షణను అభినందించారు . ఆకర్షణను చూసి గర్విస్తున్నానని మోదీ అన్నారు. గతంలో కూడా చిన్నారి ప్రయత్నానికి రాష్ట్రపతి నుంచి కూడా గతంలో ప్రశంసలు లభించాయి.