పరీక్ష కోసం నది దాటిన యువతి

పరీక్ష కోసం నది దాటిన యువతి

విజయనగరం జిల్లా: పరీక్ష రాసేందుకు ఏపీలోని విజయనగరం జిల్లాలో ఓ యువతి సాహసం చేసింది. చిత్రావతి నదికి వరద రావడంతో గజపతి నగరంలోని మర్రివలస గ్రామనికి రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో గ్రామానికి చెందిన కళావతి ఎగ్జామ్ రాయాడానికి వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురయ్యాయి. గ్రామం నుండి విశాఖపట్టణం వెళ్లాలంటే నది దాటాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలో కళావతి అనే యువతి  ప్రమాదకర ప్రయాణం చేసింది. 

వరద నీటి ప్రవాహంలో సోదరుల సహాయంతో ఈదుకుంటూ నదిని దాటింది. అక్కడి నుంచి మరో వాహనంలో ఎగ్జామ్ రాసేందుకు విశాఖకు వెళ్లింది. పరీక్ష రాసేందుకు కళావతి చేసిన సాహసం వీడియోలు వైరల్ అయ్యాయి.