కదులుతున్న రైలు ఎక్కబోయి యువతి మృతి

కదులుతున్న రైలు ఎక్కబోయి యువతి మృతి

హైదరాబాద్:  లింగంపల్లి రైల్వే స్టేషన్ లో విషాదం జరిగింది.  సోమవారం ఉదయం కదులుతున్న రైలు ఎక్కబోయి ఓ యువతి కాలు జారీ పట్టాల మీద పడి మృతి చెందింది. విజయవాడలో చదువుకుంటున్న  పుష్పిత షా(20) ఈ ఉదయం హైదరాబాద్ నుంచి అమరావతి ఎక్స్ ప్రెస్ లో వెళ్లాల్సి ఉండగా.. రైలు ఎక్కే క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి ట్రైన్ కింద పడి మృతి చెందింది. డెడ్ బాడీ ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా కి తరలించారు.

young girl lost her life when catch the moving train