లవర్ను చంపి పాతిపెట్టి.. సమాధిపైనే రెండు రాత్రులు.. మధ్యప్రదేశ్లో యువకుడి విచిత్ర ప్రవర్తన

లవర్ను చంపి పాతిపెట్టి.. సమాధిపైనే రెండు రాత్రులు.. మధ్యప్రదేశ్లో యువకుడి విచిత్ర ప్రవర్తన

మధ్యప్రదేశ్లో ఒక యువకుడి విచిత్ర ప్రవర్తన స్థానికులను, పోలీసులను ఆశ్చర్యానికి గురి చేసింది. లవర్ను చంపి పాతిపెట్టి.. సమాధిపైనే రెండు రాత్రులు పడుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  

అక్టోబర్ 02న నివారి జిల్లాలో ఓర్ఛా పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగిన ఈ ఇన్సిడెంట్ స్థానికంగా కలకలం రేపింది. నిందితుడిని రతిరాం రాజ్ పుత్ గా గుర్తించారు.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఈ మధ్యనే పెళ్లైన తన గర్ల్ ఫ్రెండ్ ను హత్యకు ముందు రాత్రి తన ఇంటికి ఆహ్వానించాడు రతిరాం. ఆ తర్వాత ఇద్దరు సరదాగా గడిపిన తర్వాత.. మెడకు టవాల్ చుట్టీ హత్యకు పాల్పడ్డాడు.

ఆ తర్వాత తన ఫ్రెండ్స్ ముకేష్, జ్ఞాన్ సింగ్ సహాయంతో గోతి తవ్వి పాతిపెట్టాడు. సమాధిని బురద, ఆవు పేడతో నింపేశాడు. దానిపై మంచం వేసుకుని రెండు రాత్రులు పడుకున్నాడు. 

యువతి రెండు రోజులుగా ఇంటికి తిరిగి రాకపోవడంతో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కుటుంబ సభ్యులు. రతిరాం పై అనుమానం ఉందని చెప్పగా.. పోలీసులు విచారించగా.. చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. 

ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. అరెస్టయిన రెండు రోజులకే రతిరాం బయటికొచ్చాడు. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు పోలీసులు. 

యువతి.. తన భర్తను వదిలేసి వచ్చేస్తానని.. తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా గత కొంత కాలంగా రతిరాం పై ఒత్తిడి పెడుతున్నట్లు పోలీసులు చెప్పారు. ఆమెతో సంబంధాన్ని కొనసాగించలేక.. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక మర్డర్ ప్లాన్ చేసినట్లు తెలిపారు. యువతిని బ్లేడుతో కోసి, కరెంటు షాకిచ్చి, మెడకు ఉరి బిగించి చంపినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రతిరాంను అరెస్టు చేసి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.