యువతి బ్లాక్​ మెయిల్.. యువకుడు సూసైడ్

యువతి బ్లాక్​ మెయిల్.. యువకుడు సూసైడ్

మెహిదీపట్నం, వెలుగు:  ఆన్​లైన్ ​ఫ్రెండ్ షిప్​చేసిన ఓ యువతి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు అడుగుతుండగా మనస్తాపంతో యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. లంగర్ హౌస్ లక్ష్మినగర్ ప్రాంతానికి చెందిన శివశంకర్ నాయక్ (24)  ప్రైవేటు ఎంప్లాయ్. కొంతకాలంగా  అతడు ఓ యువతితో  ఆన్​లైన్​లో  ఫ్రెండ్ షిప్​ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆమెకు అతడు పంపించిన ఫొటోలు, వీడియోతో డబ్బులు డిమాండ్​ చేస్తూ ఇయ్యకుంటే సోషల్​మీడియాలో పెడతానంటూ బ్లాక్​ మెయిల్​చేస్తోంది. దీంతో పరువు పోతుందని  తీవ్రమనస్తాపంతో అతడు గురువారం ఉదయం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని తల్లిదండ్రులు తెలిపారు. తమ కొడుకు సూసైడ్​కు వీడియో కాల్ లో మాట్లాడిన  యువతినే కారణమని ఆరోపిస్తున్నారు.  లంగర్​హౌస్​ పోలీసులు కేసు ఫైల్​ చేశారు.