
కంది, వెలుగు : ఆన్లైన్ ఇన్స్టాగ్రామ్ యాప్లో మోసపోయి ఓ యువకుడు గురువారం ఉరేసుకున్నాడు. సంగారెడ్డి రూరల్ ఎస్సై శ్రీనివాస్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా పుల్కల్ మండలం బొమ్మారెడ్డిగూడెం గ్రామానికి చెందిన దేవిదాస్, నాగమణి దంపతులు సంగారెడ్డి టౌన్ పోతిరెడ్డిపల్లి ఆర్టీసీ కాలనీలో ఉంటున్నారు. వీరి కొడుకు అరవింద్(31) బుధవారం ఆన్లైన్ గేమ్ ఇన్స్టాగ్రామ్లో రూ.12,53,562 పోగొట్టుకున్నాడు. ఆన్లైన్ గేమ్లో డబ్బులు కట్టించుకున్న వ్యక్తులు అరవింద్ ఐడీని బ్లాక్ చేశారని, దీంతో తాను మోసపోయినట్లు గుర్తించి ఆవేదన చెందాడు. తన బెడ్రూంలో చీరతో ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. మృతుడి తండ్రి దేవిదాస్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.