శబరిమల పాదయాత్రలో అపశ్రుతి

శబరిమల పాదయాత్రలో అపశ్రుతి

మనోహరాబాద్, వెలుగు : శబరిమలకు పాదయాత్రగా వెళుతున్న యువకుడు ప్రమాదంలో చనిపోయాడు. మెదక్  జిల్లా మనోహరాబాద్  మండలం కూచారం గ్రామానికి చెందిన ఏడుగురు యువకులు ఈనెల 12న అయ్యప్పమాల ధరించారు. అదేరోజు శబరిమలకు పాదయాత్రగా బయలుదేరారు. 

ఈ క్రమంలో కర్నాటక రాష్ట్రంలోని బెంగళూరు దగ్గర పాలసముద్రం వద్ద అతివేగంగా వచ్చిన బైకు యాత్రికులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో శివయాదవ్  (26) తీవ్రంగా గాయపడి చనిపోయాడు. తోటి భక్తులు ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి తెస్తున్నారు. యాక్సిడెంట్ పై కర్నాటక పోలీసులు కేసు నమోదు చేశారు.