యువత దొరల గడీలను బద్దలు కొట్టాలె

యువత దొరల గడీలను బద్దలు కొట్టాలె
  • బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కో-ఆర్డినేటర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్

రాజన్న సిరిసిల్ల: సిరిసిల్లలో దొరల గడిలను బద్దలు కొట్టేందుకు యువ కిశోరాలు ముందుకు రావాలని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కో-ఆర్డినేటర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడించాలని ఆయన కోరారు. ఆదివారం సిరిసిల్లలో బీఎస్పీ జిల్లా సదస్సు జరిగింది. బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కో-ఆర్డినేటర్, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. 
బహుజనుల ప్రాణాల మీద నాకు ప్రేమ ఉంది కాబట్టే రాజకీయాల్లోకి వచ్చానని ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. సిరిసిల్లలో పోలీసుల అండతోనే అక్రమ ఇసుక రవాణా సాగుతోందని ఆయన ఆరోపించారు. అందరికీ చెందాల్సిన ఇసుకను రాత్రింబవళ్ళు తరలిస్తూ ప్రాణాలు తీస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్లారెడ్డిపేటలో గిరిజన బాలికపై అత్యాచారం జరగడం బాధాకరం అన్నారు. 

 

ఇవి కూడా చదవండి

కేసీఆర్కు బీజేపీ భయం పట్టుకుంది

మేడారం జాతర హుండీ లెక్కింపు.. 5వ రోజు ఆదాయం ఎంతంటే

మనసు మార్చుకున్న ఉక్రెయిన్ ప్రెసిడెంట్