కేసీఆర్కు బీజేపీ భయం పట్టుకుంది

కేసీఆర్కు బీజేపీ భయం పట్టుకుంది

కేసీఆర్ బీజేపీ భయం పట్టుకుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ముఖ్యమంత్రి కుటుంబ పాలనను త్వరలోనే బొందపెడతామని హెచ్చరించారు. యువ తెలంగాణ పార్టీ బీజేపీలో విలీనమైన సందర్భంగా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు. కేసీఆర్ ను తరిమికొట్టే ఉద్యమం చేయాల్సిన సమయం వచ్చిందన్న ఆయన.. లాఠీ దెబ్బలకు బీజేపీ పార్టీ భయపడదని అన్నారు. ఉద్యమకారులను కనుమరుగు చేసి కేసీఆర్ తన చరిత్ర మాత్రమే కనపడేలా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. 

ఉక్రెయిన్లో తెలంగాణ విద్యార్థులు చిక్కుకుపోయినా కేసీఆర్ పట్టించుకోలేదని బండి సంజయ్ మండిపడ్డారు. కనీసం ఒక్క మంత్రి కూడా పరిస్థితిని రివ్యూ చేయలేదని వాపోయారు. కేంద్ర ప్రభుత్వ చొరవతో స్వదేశానికి చేరుకున్న వారికి స్వాగతం పలికేందుకు మాత్రం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిగ్గులేకుండా వెళ్లారని చురకలంటించారు.

For more news..

ప్రధాని మోడీ హైలెవల్ మీటింగ్

మనసు మార్చుకున్న ఉక్రెయిన్ ప్రెసిడెంట్