న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా సంస్థ తిరిగి సొంత గూటికి చేరడంతో టాటా కంపెనీ సంతోషంలో మునిగిపోయింది. ఎయిర్ ఇండియాపై టాటా సంస్థకు ఉన్న మమకారం ఏంటో మరోసారి బయటపడింది. టాటా గ్రూప్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో చేసిన ట్వీట్ ను బట్టి దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఎయిర్ ఇండియా కోసం చాన్నాళ్లుగా ఆతృతగా ఎదురు చూశామని, వెల్కమ్ బ్యాక్ అంటూ టాటా గ్రూప్ ట్వీట్ చేసింది. ఎయిర్ ఇండియాను తిరిగి దక్కించుకోవడంపై టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ కూడా హర్షం వ్యక్తం చేశారు. ఎయిర్ ఇండియాను ప్రపంచ స్థాయి ఎయిర్ లైన్ గా మార్చేందుకు అవసరమైన ప్రతి ఒక్కరితో కలసి పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
Your arrival was much awaited, @airindiain. #AirIndiaOnBoard #ThisIsTata pic.twitter.com/OVJiI1eohU
— Tata Group (@TataCompanies) January 27, 2022
కాగా, ఎయిర్ ఇండియా మళ్లీ టాటాల సొంతమైంది. 69 ఏళ్ల తర్వాత ఇవాళ అధికారికంగా టాటాలకు ఎయిర్ ఇండియా సంస్థను కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు అఫీషియల్ ప్రాసెస్ పూర్తయింది. టాటా సంస్థకు ఎయిర్ ఇండియా అప్పగింత పనులు పూర్తయ్యాయని డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్ మెంట్ సెక్రటరీ తుహిన్ కాంత్ పాండే తెలిపారు. కంపెనీ షేర్లను తలాస్ ప్రైవేట్ లిమిటెడ్ కు బదిలీ చేశామని పేర్కొన్నారు.
మరిన్ని వార్తల కోసం: