డిసెంబర్ 20న ‘మీ డబ్బు మీ హక్కు’పై శిబిరం : కలెక్టర్ అభిలాష అభినవ్

డిసెంబర్  20న ‘మీ డబ్బు  మీ హక్కు’పై శిబిరం :  కలెక్టర్ అభిలాష అభినవ్
  •     కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్, వెలుగు: బ్యాంకుల్లో సంవత్సరాలుగా క్లెయిమ్ చేసుకోని డబ్బును అర్హులు క్లెయిమ్​చేసుకునే అవకాశం కల్పించేందుకు ఈ నెల 20న కలెక్టరేట్​లో ‘మీ డబ్బు మీ హక్కు’ అనే అంశంపై ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం ఆదేశాల మేరకు  ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 

బ్యాంకుల్లో పొదుపు, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, డివిడెంట్స్, బీమాలు క్లెయిమ్ చేసుకునేందుకు ఈ శిబిరం ద్వారా అవకాశం కల్పిస్తున్నామన్నారు. పదేండ్ల పైబడి బ్యాంకుల్లో క్లెయిమ్ చేసుకోని నిల్వ వివరాలు ఆర్​బీఐ ఉద్గం వెబ్ సైట్ నుంచి పొందవచ్చని పేర్కొన్నారు. నిజమైన హక్కుదారులకు బ్యాంకుల్లోనే డబ్బులు పొందేందుకు ఆకాశం కల్పిస్తున్నామని, అర్హులు వినియోగించుకోవాలని కలె క్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.