శిక్షపడుతుందనే భయంతో యువకుడి ఆత్మహత్య

శిక్షపడుతుందనే భయంతో యువకుడి ఆత్మహత్య

చొప్పదండి, వెలుగు: యాక్సిడెంట్​ కేసులో తనకు శిక్ష పడుతుందనే భయంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం..కరీంనగర్​జిల్లా చొప్పదండి మండలం కొలిమికుంటకు చెందిన రాగం మహేశ్‌(32) ట్రాక్టర్​ డ్రైవర్. 2016లో టూవీలర్‌పై వెళ్తూ యాక్సిడెంట్​చేయగా ఓ వ్యక్తి చనిపోయాడు. మహేశ్​పై కేసు ఫైల్​కాగా కోర్టులో విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ కేసు జడ్జిమెంట్​దశకు వచ్చిందని, కొద్దిరోజుల్లో తనకు శిక్షపడుతుందని భావిస్తూ బాధపడుతున్నాడు. 

శుక్రవారం మహేశ్​భార్య నిర్మల వ్యవసాయ పనులకు వెళ్లగా ఉదయం పురుగు మందు గుళికలు మింగాడు. గమనించిన పిల్లలు తల్లికి సమాచారం ఇవ్వడంతో ఆమె స్థానికుల సాయంతో కరీంనగర్​హాస్పిటల్​కు తరలించింది. ట్రీట్​మెంట్​పొందుతూ చనిపోయాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉపేంద్రాచారి తెలిపారు.