
గరిడేపల్లి, వెలుగు: దసరా పండుగ సందర్భంగా సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం వెలిదండలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈనెల 24 నుంచి 30 వరకు వెలిదండ జడ్పీ హైస్కూల్ గ్రౌండ్లో పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలకు ఎంట్రీ ఫీజు రూ.500గా నిర్ణయించారు. ప్రథమ బహుమతి రూ.25,000, ద్వితీయ బహుమతి రూ.20,000, తృతీయ బహుమతి రూ.15,000, నాలుగో బహుమతి రూ.10,000 ప్రకటించారు.
పోటీల ప్రారంభోత్సవానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆహ్వానించినట్లు నిర్వహకులు, యూత్ కాంగ్రెస్ నేతలు తెలిపారు. కబడ్డీతో పాటు పురుషుల టగ్ ఆఫ్ వార్, గ్రామస్థాయి మహిళా కబడ్డీ, మహిళల తాడు లాగుడు, బతుకమ్మ పోటీలు కూడా నిర్వహించనున్నట్లు చెప్పారు. మరిన్ని వివరాలకు ఫోన్ : 6281111757, 9951320946, 9505579593 నంబర్లలో సంప్రదించాలని కోరారు.