చెన్నై : టిక్టాక్ సరదా ఓ యువకుడి ప్రాణం తీసింది. ఈ దారుణ సంఘటన తమిళనాడులోని తంజావురులో జరిగింది. కొత్త పద్ధతిలో వీడియో తీసి… టిక్ టాక్ లో ఫాలోయింగ్ పెంచుకోవాలన్న ఆరాటం… ఒక యువకుడిని బలి తీసుకుంది.
ముగ్గురు యువకులు సూర్య, రైగాన్, విజ్ఞేష్ అనే ముగ్గురు యువకులు బైక్పై వెళ్తుండగా… వెరైటీగా వీడియో తీసుకోవాలనుకున్నారు. ఒకరు బైక్ రైడ్ చేస్తుండగా.. మరొకరు వీడియో తీశారు. కొంత దూరం బాగానే వెళ్లారు. వీడియో తీసుకుంటున్న సంబురంలో… వేగంగా వెళ్తూ… వాహనాల మధ్య జిగ్ జాగ్ గా డ్రైవింగ్ చేస్తూ…. ఎదురుగా వెళ్తున్న బస్సును ఢీకొట్టారు. బస్సును బైక్ వేగంగా ఢీకొట్టడంతో… ముగ్గురు యువకులు స్పాట్ లోనే తీవ్రగాయాలతో కూలబడిపోయారు. ముగ్గురిని హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు స్థానికులు. ఐతే… అందులో ఒక యువకుడు సూర్య ప్రాణం అప్పటికే పోయిందని డాక్టర్లు చెప్పారు. ఈ యాక్సిడెంట్ వీడియో ఇపుడు… సోషల్ మీడియాలో తిరుగుతోంది.