తల్లాడ, వెలుగు : ఖమ్మం జిల్లాలో సాగర్ కాల్వలో యువకుడు గల్లంతైన ఘటన ఆదివారం ఏన్కూర్ మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం.. తిమ్మారావుపేట గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ సమీపంలోని సాగర్ కెనాల్ లో ఈత కొడుతూ గల్లంతయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న ఏన్కూర్ పోలీసులు కెనాల్ లో గాలింపు చర్యలు చేపట్టారు. అతడి ఆచూకీ దొరకలేదు.
