పండగపూట విషాదం.. రోడ్డు ప్రమాదాల్లో యవకులు మృతి

పండగపూట విషాదం.. రోడ్డు ప్రమాదాల్లో యవకులు మృతి

సంక్రాంతి పండుగ వేళ ఏపీలో కొన్ని చోట్ల విషాద ఛాయలు అలుముకున్నాయి.  కృష్ణా జిల్లా పామర్రు మండలం కురుమద్దాలిలో వద్ద రోడ్డు ప్రమాదంలో తానేటి హరీష్ (22), పంది గోవింద్ (22) ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.  పెట్రోల్ బంక్ నుండి మోటార్ బైక్ కు పెట్రోల్ కొట్టించుకుని ఇంటికి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు.  

యువకుల మరణ వార్త విని శోకసముద్రంలో మునిగిపోయారు కుటుంబ సభ్యులు. తిరుపతిలో దొరవారి సత్రంలో వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దోరవారి సత్రం మండలం కలగుంట వద్ద బ్రిడ్జి సమీపంలో బైక్ ను  గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ముగ్గురు యవకులు మృతి చెందారు. చనిపోయిన వారిని మునిరాజ (24) , రామ్ (25), గౌతమ్ (24)గా గుర్తించారు.