జైపూర్కు చెందిన ఓ యూట్యూబర్..దీపావళి సందర్భంగా రైలు పట్టాలపై స్నేక్ క్రాకర్స్ కాల్చి.. ఆ మంటలు, పొగను వీడియో తీశాడు. దానిని సోషల్ మీడియాలో రిలీజ్ చేయడంతో విమర్శలకు దారితీసింది.
వ్యూస్ కోసం ఇలా రైల్వే ట్రాక్ పై పటాకులు కాల్చడమేంటని నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ ఘటనపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ దర్యాప్తు ప్రారంభించింది.