అమరావతి: నేడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి. ఈ సందర్భంగా ఆయన కుమారుడు ఏపీ సీఎం జగన్ ట్విట్టర్ వేదికగా వైఎస్ఆర్ ను స్మరించుకుంటూ నివాళులర్పించారు. “నాన్నగారి 71వ జయంతి నేడు. ఆయన మరణం లేని మహానేత. ఆరోగ్య శ్రీ, 104, 108 సేవలు, ఫీజు రీయింబర్స్ మెంట్, రైతులకు ఉచిత విద్యుత్, జలయజ్ఞం.. ఇలా ఎన్నో పథకాల రూపంలో ఆయన ఎప్పటికీ చిరంజీవే.. రైతు పక్షపాతి అయిన మహానేత జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది” అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.