
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ నెల 30న ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఈ కార్యక్రమానికి వేదిక కానుంది. జగన్ ఆహ్వానం మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ నరసింహన్, మరియు పలు పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు.
ప్రమాణ స్వీకారోత్సవానికి పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.5 వేల మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ప్రజాప్రతినిధుల వాహనాల పార్కింగ్ కోసం ఏఆర్ మైదానాన్ని, అధికారులు, సిబ్బంది, సహాయకుల వాహనాల పార్కింగ్ కోసం బిషప్ అజరయ్య ఉన్నత పాఠశాల, స్టేట్ గెస్ట్హౌస్లను కేటాయించారు.
జగన్ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా భారీ వాహనాలను మళ్లించాలని పోలీసులు నిర్ణయించారు. హైదరాబాద్, చెన్నై వెళ్లే వాహనాల దారి మళ్లించేందుకు ఏర్పాట్లు చేశారు.
ఎవరెవరు ఎలా వెళ్లాలంటే…
- విశాఖపట్టణం నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు 30న కృష్ణా జిల్లా హనుమాన్జంక్షన్, నూజివీడు, విస్సన్నపేట, ఖమ్మం జిల్లా వైరా, ఖమ్మం, సూర్యాపేట మీదుగా హైదరాబాద్కు వెళ్లాల్సి ఉంది.
- హైదరాబాద్ నుంచి విశాఖపట్టణం వెళ్లే వాహనాలు హైదరాబాద్, ఇబ్రహీంపట్నం, మైలవరం, నూజివీడు, హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖపట్టణం చేరుకోవాల్సి ఉంటుంది. అలాగే.. హైదరాబాద్, కంచికచర్ల, జి.కొండూరు, మైలవరం, నూజివీడు, హనుమాన్ జంక్షన్ మీదుగా కూడా విశాఖపట్టణం చేరుకోవచ్చు.
- విశాఖ నుంచి చెన్నై వెళ్లే వాహనాలు గుంటూరు, తెనాలి, బాపట్ల, అవనిగడ్డ, చల్లపల్లి, పామర్రు, గుడివాడ, హనుమాన్ జంక్షన్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
- హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లే వాహనాలు నార్కట్పల్లి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, అడవినెక్కలం, మేదరమెట్ల, ఒంగోలు మీదుగా చెన్నై వెళ్లాల్సి ఉంటుంది.
- చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు ఒంగోలు, మేదరమెట్ల, అడవినెక్కలం, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ, నార్కట్పల్లి మీదుగా హైదరాబాద్ చేరుకోవచ్చు.