నేడు మూడు జిల్లాల్లో జగన్ ప్రచారం

నేడు మూడు జిల్లాల్లో జగన్ ప్రచారం

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ఆదివారం తూర్పుగోదావరి, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో జగన్‌ ప్రచారం చేయనున్నారు. ఆ తర్వాత ఉదయం 11.30 గంటలకు విశాఖ జిల్లా అనకాపల్లిలో నిర్వహించే ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ప్రచారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు గాజువాకలో జగన్ ప్రచారం చేయనున్నారు