బంగారు తెలంగాణ కాదు...బతుకు లేని తెలంగాణ

బంగారు తెలంగాణ కాదు...బతుకు లేని తెలంగాణ

రెండుసార్లు సీఎం అయిన కేసీఆర్ రాష్ట్రానికి చేసిందేం లేదని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు.ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం షర్మిల పాదయాత్ర 89వ రోజుకు చేరుకుంది. వైరా మండలం గన్నవరం నుంచి ఖానాపూర్ వరకు షర్మిల ట్రాక్టర్ నడిపారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచి ప్రయాణీకులపై భారం మోపుతున్నారంటూ టీఆర్ఎస్ సర్కార్ పై ఫైర్ అయ్యారు.ఎన్నికల హామీలను విస్మరించారని.. సీఎం కేసీఆర్ అన్ని వర్గాలను మోసం చేశారన్నారు.ఇది బంగారు తెలంగాణ కాదు...బతుకు లేని తెలంగాణ, అప్పులు, ఆత్మహత్యల తెలంగాణ అని విర్శించారు.