ఒక్క విగ్రహాన్ని కూల్చితే వెయ్యి విగ్రహాలు పెడతాం ఎర్రబెల్లి : షర్మిల

ఒక్క విగ్రహాన్ని  కూల్చితే  వెయ్యి విగ్రహాలు పెడతాం ఎర్రబెల్లి : షర్మిల

వైఎస్ఆర్ విగ్రహం కూల్చివేతపై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. అర్ధరాత్రి బీఆర్ఎస్ గూండాలు విగ్రహాన్ని ధ్వంసం చేశారని ఆరోపించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దగ్గరుండి మరీ ఈ పని చేయించారని ఆరోపణలు చేశారు. వైఎస్ఆర్ విగ్రహా ఏర్పాటును అడ్డుకునేందుకు మంత్రి ఎర్రబెల్లి మొదటి నుంచి కూడా చాలా ప్రయత్నాలు చేశారని చెప్పారు. ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్న వైఎస్సార్ అభిమానాన్ని తట్టుకోలేక ఈ పని చేశాడని షర్మిల విమర్శించారు.

అభివృద్ధిపై బహిరంగ చర్చకు వచ్చే దమ్ములేక విగ్రహాల మీద రాజకీయం చేయడం దారుణమని వైఎస్ షర్మిల అన్నారు. కనీసం డిగ్రీ కాలేజీ కూడా తీసుకురాలేని అసమర్థ మంత్రి దయాకర్ రావు అని విమర్శించారు. నిజంగా దయాకర్ కు దయ ఉంటే వైఎస్సార్ విగ్రహాన్ని పెట్టించి నిజాయతీ నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. ఒక్క విగ్రహాన్ని పడగొడితే పాలకుర్తిలో వెయ్యి విగ్రహాలు పెడతామని షర్మిల చెప్పారు.