కేసుల్లోంచి బయటపడేందుకే బీజేపీతో కేసీఆర్​ దోస్తీ

కేసుల్లోంచి బయటపడేందుకే బీజేపీతో కేసీఆర్​ దోస్తీ
  • వైఎస్సార్​టీపీ చీఫ్ షర్మిల

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ అంటే బీజే పీకి రహస్య సమితి అని వైఎస్సార్​టీపీ చీఫ్ షర్మిల ఆరోపించారు. కేసీఆర్, బీజేపీ ఒక్కటికాదని కేటీఆర్​ చెబుతున్నా.. పాపం చిన్న పిల్లవాడు కూడా నమ్మడం లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో లేని బీజేపీని పైకిలేపి, ఇన్నాళ్లు విమర్శలు గుప్పించిన కేసీఆర్.. తన కొడుకు, కూతురు కేసుల్లో ఇరుక్కోవడంతో వాటి నుంచి బయట పడేందుకు బీజేపీతో జతకట్టాడని గురువారం ట్వీట్ చేశారు. 

ఒక్కసారిగా ఆయన నాలుక బీజేపీ నుంచి ఇంకో పార్టీకి మళ్లిందని ఆరోపించారు.  ‘తొమ్మిదేండ్లుగా విభజన హామీలపై మోదీని నిలదీయకుండా,  రాష్ట్రానికి వచ్చే నిధుల వాటా గురించి మాట్లాడని  కేసీఆర్.. మోదీకి తొత్తు కాదా? బీఆర్ఎస్ బీజేపీకి ‘బీ’ టీం కాదా’ అని షర్మిల ప్రశ్నించారు.