అడ్డుకున్నోళ్లే టార్గెట్.. కాంగ్రెస్ లీడర్ల సెగ్మెంట్లపైనే షర్మిల గురి

అడ్డుకున్నోళ్లే టార్గెట్..  కాంగ్రెస్ లీడర్ల సెగ్మెంట్లపైనే షర్మిల గురి

హైదరాబాద్: వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయకుండా అడ్డుపడిన నాయకుల ఓటమే లక్ష్యంగా షర్మిల పావులు కదుపుతున్నారు. కొన్ని సెగ్మెంట్లను లక్ష్యంగా చేసుకొని ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని సమాచారం. ప్రధానంగా తన ఎంట్రీకి అడ్డుపడ్డట్టుగా భావిస్తున్న పొంగిలేటికి మొదటిగా చెక్ పెట్టే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆమె మొదటి నుంచి చెబుతున్నట్టుగా పాలేరు నుంచే పోటీ చేయనున్నారు.

ఇక్కడ దివంగత సీఎం వైఎస్సార్ కు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉండటం కలిసొస్తుందని ఆమె భావిస్తున్నారని సమాచారం. దాదాపు30–34 సెగ్మెంట్లలో బలమైన అభ్యర్థులను బరిలోకి దించేందుకు ఆమె ప్లాన్ వేస్తున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో కాంగ్రెస్ కు పట్టున్న స్థానాలే లక్ష్యంగా ఆమె తన అభ్యర్థులను బరిలోకి దింపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఆ సెగ్మెంట్లలో పార్టీలో యాక్టివ్ గా ఉండే నేతలను రంగంలోకి దించి కాంగ్రెస్ విజయావకాశాలను తారుమారు చేసే వ్యూహాన్ని అమలు చేయాలనుకుంటున్నట్టు సమాచారం.