కేసీఆర్.. నీ అధికారానికి నిప్పు పెట్టుడు పక్కా

కేసీఆర్.. నీ అధికారానికి నిప్పు పెట్టుడు పక్కా

హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్ల విషయంలో జాప్యంపై వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల మరోసారి సీరియస్ అయ్యారు. సర్కారు తీరుకు ఆగ్రహించి కొందరు రైతన్నలు తమ పంటలు తగులబెట్టుకుంటున్నారని.. మరికొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని షర్మిల అన్నారు. ఎవడు చస్తే తమకేందని ప్రభుత్వం చేతులెత్తేసిందని, కేసీఆర్ ధాన్యం కొనకుండా రాజకీయాలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. వడ్లు కొనకపోతే కాలర్ పట్టుడు పక్కా, అధికారానికి నిప్పు పెట్టుడు పక్కా అని కేసీఆర్ కు వార్నింగ్ ఇచ్చారు. వడ్లు కొనకుండా రైతన్నలపై సర్కారు పగపడుతోందని, తరుగు పేరిట మిల్లర్లు దోచుకుంటున్నారని ఆమె ట్వీట్ చేశారు. 

మరిన్ని వార్తల కోసం: 

తలలపై తుపాకులు పెట్టి పాలించలేరు

నాకు జరిగిన అవమానం మరొకరికి జరగకూడదు

జవాన్లకే సాయమందలేదు.. రైతులకు అందుతుందా?