హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్ల విషయంలో జాప్యంపై వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల మరోసారి సీరియస్ అయ్యారు. సర్కారు తీరుకు ఆగ్రహించి కొందరు రైతన్నలు తమ పంటలు తగులబెట్టుకుంటున్నారని.. మరికొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని షర్మిల అన్నారు. ఎవడు చస్తే తమకేందని ప్రభుత్వం చేతులెత్తేసిందని, కేసీఆర్ ధాన్యం కొనకుండా రాజకీయాలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. వడ్లు కొనకపోతే కాలర్ పట్టుడు పక్కా, అధికారానికి నిప్పు పెట్టుడు పక్కా అని కేసీఆర్ కు వార్నింగ్ ఇచ్చారు. వడ్లు కొనకుండా రైతన్నలపై సర్కారు పగపడుతోందని, తరుగు పేరిట మిల్లర్లు దోచుకుంటున్నారని ఆమె ట్వీట్ చేశారు.
తిరగబడ్డడు రైతన్న!
— YS Sharmila (@realyssharmila) November 26, 2021
వడ్లు కొనకుండా రైతు మీద సర్కారు పగపడుతుంటే,
తరుగు పేరిట మిల్లర్లు దోచుకుంటుంటే,
కొంటారో కొనరో తెలియక రైతు గుండెలు ఆగిపోతుంటే,
ఎవడు చస్తే నాకేంటని సర్కారు చేతులెత్తేస్తే,
KCR ధాన్యం కొనక రాజకీయాలు చేస్తుంటే..
తిరగబడ్డడు రైతన్న! 1/2 pic.twitter.com/bE5NgrApaX
ఆగ్రహించిన రైతన్న చేతకాని సర్కార్ తీరుకు పంటను తగలబెట్టుకొంటుండు! ఆత్మహత్య చేసుకుంటుండు!
— YS Sharmila (@realyssharmila) November 26, 2021
దొరా..నువ్వు పంట కొననని రైతులతో కాళ్ళు మొక్కించుకున్నా,పంటను కొనకుండా రైతులతో పంటను తగలబెట్టేలా చేసినా,నువ్వు వడ్లు కొనకపోతే నీ కాలర్ పట్టుడు పక్కా.
నీ అధికారానికి నిప్పు పెట్టుడు పక్కా.. 2/2