రోశయ్య మృతికి సంతాపం తెలిపిన షర్మిల
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోషయ్య మృతికి ట్వీటర్ వేదికగా ప్రగాఢ సంతాపం తెలిపారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షరాలు షర్మిల. ఉమ్మడి రాష్ట్రాన్ని రోశయ్య ప్రగతి పథంలో నడిపించిన తీరు మరువలేనిదని కొనియాడారు. రోశయ్య సేవలనుగుర్తు చేసుకున్నారు. తన తండ్రి దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆయన చాలా ఆత్మీయులని షర్మిల గుర్తు చేసుకున్నారు. రోశయ్య మృతి రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటుూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు షర్మిల.