మా యాత్రలను అడ్డుకుంటే ఊరుకునేది లేదు

మా యాత్రలను అడ్డుకుంటే ఊరుకునేది లేదు

రైతులకు భరోసా కల్పించడానికి  ఈ నెల 19 నుంచి  రైతు ఆవేదన యాత్ర మొదలు పెడ్తామన్నారు వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత యాత్ర స్టార్ట్ చేస్తామన్నారు. పరామర్శకు వెళితే చేతగాని తనంతో తమను అరెస్ట్ చేస్తున్నారన్నారు. తమ యాత్రలను అడ్డుకుంటే ఊరుకునేది లేదని... కేసీఆర్ ను హెచ్చరించారు. 70 రోజుల్లో 200 వందలమంది ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి కనీసం రూ. 25 లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెంటనే వరి కొనుగోళ్లు చేయాలన్నారు. రైతుకు వరి పండించే హక్కు ఉందన్నారు.