వృద్ధ్యాప్య మహిళలకు సీఎం కేసీఆర్ ఆర్థిక భరోసా లేకుండా చేశారన్నారు వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. పొదుపు సంఘాల మహిళలకు వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా ఉండాలని YS రాజశేఖర రెడ్డి చేసిన ఆలోచనల ఫలితమే అభయహస్తం పథకం అని అన్నారు. 2017 వరకు అమలైన పథకంలో మార్పులు తీసుకొస్తామని చెప్పిన కేసీఆర్ సర్కార్ ఐదేండ్లయితున్నా ఇప్పటివరకు అమలు చేయలేదన్నారు. అభయహస్తం పథకం కింద డబ్బులు కట్టిన మహిళలకు తిరిగి ఇవ్వలేదన్నారు.ఇంటికో పెన్షనంటూ మెలికలు పెట్టి పథకాన్ని అటకెక్కించారన్నారు. ఆసరా పెన్షన్స్ తో సంబంధం లేకుండాఅభయహస్తం పథకాన్ని తిరిగి కొనసాగించాలన్నారు. లేదంటే మహిళలు కట్టిన డబ్బులు వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు.
పొదుపు సంఘాల మహిళలకు
— YS Sharmila (@realyssharmila) February 1, 2022
వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా ఉండాలని YS
రాజశేఖర రెడ్డి గారు చేసిన ఆలోచనల ఫలితమే అభయహస్తం పథకం.
2017 వరకు అమలైన పథకంలో మార్పులు తీసుకొస్తామని చెప్పిన కేసీఆర్ సర్కార్
ఐదేండ్లయితున్న ఇప్పటివరకు అమలు చేసింది లేదు. అభయహస్తం పథకం కింద డబ్బులు కట్టిన మహిళలకు 1/2