కేసీఆర్.. తలకిందులుగా తపస్సు చేసినా మీ పాపం పోదు

కేసీఆర్.. తలకిందులుగా తపస్సు చేసినా మీ పాపం పోదు

సిద్దిపేట జిల్లా: ధరణి పోర్టల్ లో భూమి ఎక్కలేదని ఒకే ఇంట్లో తండ్రీ కొడుకులు చనిపోయిన ఘటన గజ్వేల్ నియోజకర్గం, దండుపల్లిలో చోటు చేసుకుంది. మృతి చెందిన రైతు చింతల స్వామి కుటుంబాన్ని వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల పరామర్శించారు. వీరి చావులకు కేసీఆరే కారణమన్నారు షర్మిల. ఏడాది అయినా తల్లికి పెన్షన్ రాలేదని.. రైతుల పాలిట కేసీఆర్ హంతకుడిలా తయారయ్యారని విమర్శించారు. రోజుకో రైతు చనిపోతుంటే దొర కండ్లు తెరవడం లేదని మండిపడ్డారు. సీఎం సొంత ఇలాఖాలోనే రైతుల ప్రాణాలు పోతున్నా పట్టింపు లేదన్నారు. కేసీఆర్ తలకిందులుగా తపస్సు చేసినా ఈ పాపం పోదని దుయ్యబట్టారు. బాధిత కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కనీసం బతికున్న వాళ్లనైనా ఆదుకోవాలన్నారు.