రాష్ట్రాన్ని కేసీఆర్ చావుల కాష్టంగా తయారు చేసిండు

రాష్ట్రాన్ని కేసీఆర్ చావుల కాష్టంగా తయారు చేసిండు

జీవో 317 వల్ల ఉద్యోగులు చనిపోతుంటే కేసీఆర్ కు ఆపాలనే సోయి లేదా అని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. నిరుద్యోగులు, రైతులు, ఉద్యోగుల చావులతో రాష్ట్రాన్ని కేసీఆర్ చావుల కాష్టంగా మార్చారని ఆమె మండిపడ్డారు. రైతు సంక్షేమమంటే రైతులు పురుగుల మందు తాగి చచ్చేలా చేయడమేనా అని షర్మిల ప్రశ్నించారు. ఉద్యోగుల కాలికి ముళ్ళు దిగితే మునిపంటితో తీస్తానంటే... వారిని సొంత ఊరునుంచి వెళ్లగొట్టడమేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతమంది చనిపోతున్నా పట్టించుకోని చేతకాని ముఖ్యమంత్రి మనకొద్దు అని షర్మిల అన్నారు.

‘అయితే నిరుద్యోగులు, లేకపోతే రైతులు, కాకపోతే ఉద్యోగులు.. బంగారు తెలంగాణ పేరుతో రాష్ట్రాన్ని చావుల కాష్టంగా తయారు చేసిన హంతకుడు KCR. ఒకవైపు రోజుకు ఇద్దరు రైతులు ఆత్మహత్యలు చేసుకొంటుంటే, మరోవైపు G.O. 317 ఉద్యోగుల ఊపిరి తీస్తుంటే.. దొరకు మాత్రం ఆ చావులను ఆపాలనే సోయి రావడం లేదు.

రైతు సంక్షేమం అంటే రైతులు పురుగుల మందు తాగి చచ్చేలా చేయడమా? కొట్లాడి తెచ్చుకొన్న తెలంగాణలో ఉద్యోగుల కాలికి ముళ్ళుదిగితే మునిపంటితో తీస్తాను అంటే వారిని సొంత ఊరునుంచి వెళ్లగొట్టి చంపడమా? ఉద్యోగుల ఉసురు తీసుకుంటున్న చేతకాని ముఖ్యమంత్రి మనకొద్దు’ అని షర్మిల ట్వీట్ చేశారు.

For More News..

జైలులో ఉన్న 46 మంది ఖైదీలకు కరోనా

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అరెస్ట్

ప్లేట్​ దోసె 2, ఇడ్లీ 3, ఊతప్పం 4 రూపాయలు