ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హాట్ కామెంట్స్ చేశారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కుట్ర చేసి చంపారని.. తనను కూడా అలాగే చంపాలని చూస్తున్నారని ఆరోపించారు. ఏ క్షణమైనా తన పాదయాత్రను అడ్డుకొని అరెస్ట్ చేయవచ్చన్నారు. తాను బేడీలకు భయపడే వ్యక్తిని కాదన్నారు.
మంత్రి నిరంజన్ రెడ్డి పై తాను వ్యాఖ్యలు చేస్తే కేసు పెట్టారు కానీ తనపై ఆయన చేసిన విమర్శల మీద కంప్లైంట్ చేసినా ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదని షర్మిల అన్నారు. తాను పులి బిడ్డనని, తనకు భయం లేదని, దమ్ముంటే తనని అరెస్ట్ చేయాలంటూ షర్మిల సవాల్ విసిరారు. ఊపిరి ఉన్నంత వరకు ప్రజలనుంచి తనని దూరం చేయలేరని షర్మిల స్పష్టం చేశారు.