సీఎం కేసీఆర్ ప్రజలను ఆగం చేసిండు

 సీఎం కేసీఆర్ ప్రజలను ఆగం చేసిండు

సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ అని చెప్పి తన కుటుంబాన్ని బంగారం చేసుకున్నారని వైఎస్ఆర్టీపీ (YSRTP) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ఇవాళ వనపర్తి జిల్లాలో వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా ఆమె కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. వ్యవసాయానికి ముప్పై వేలు ఇచ్చే పథకాలను బంద్ పెట్టి.. ముష్టి ఐదు వేలు ఇస్తున్నరని మండిపడ్డారు. డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తానని కేసీఆర్ మోసం చేశారని  విమర్శించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను కేసీఆర్ తన మాటలతో దగా చేశారని ఆమె ఫైర్ అయ్యారు. 

ఎన్నికల్లో బూటకపు హామీలు ఇచ్చి, ఓట్లు తన్నుకుపోయిన కేసీఆర్, ప్రజలను ఆగం చేశాడని షర్మిల మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసం కేసీఆర్ మళ్లీ వస్తడు.. మాయమాటలు చెప్తడు. ఈసారి మోసపోవద్దని ఆమె ప్రజలకు సూచించారు. కేసీఆర్ కు గట్టి బుద్ధి చెప్పాలె. డబ్బులు పంచితే తీసుకోవాలె.. ఆ డబ్బంతా మన దగ్గర దోచుకున్నదే అన్నారు. అయితే ఓటు మాత్రం సేవ చేసేటోళ్లకే వేయాలె అని షర్మిల తెలిపారు.