నిజాం షుగర్ ఫ్యాక్టరీ వద్ద వైఎస్ షర్మిల ధర్నా

నిజాం షుగర్ ఫ్యాక్టరీ వద్ద వైఎస్ షర్మిల ధర్నా

అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. జగిత్యాల జిల్లాలో షర్మిల పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఆమె నిజాం షుగర్ ఫ్యాక్టరీ దగ్గర మహా ధర్నా నిర్వహించారు. వెంటనే ఫ్యాక్టరీని రీఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్ హామీ ఇచ్చి ఇప్పటికి ఎన్ని వంద రోజులు గడిచాయంటూ షర్మిల ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ నేతలకు మాట మీద నిలబడే తత్వం లేదన్నారు. హామీలిచ్చి అమలు చేయడం లేదంటూ ఫైర్ అయ్యారు. ఫ్యాక్టరీని ప్రభుత్వ పరం చేస్తామని మొత్తానికే మూసేశారంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.