రోడ్లను రిపేర్ చేయాలని గ్రామస్తుల డిమాండ్ 

రోడ్లను రిపేర్ చేయాలని గ్రామస్తుల డిమాండ్ 

కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. కోయపోశ గూడెంలో వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను రిపేర్ చేయాలని డిమాండ్ చేశారు. వరదలకు రోడ్లు దెబ్బతిన్నా ప్రభుత్వం పట్టించుకోడం లేదని ఆర్నకొండ దగ్గర గ్రామస్తులు ధర్నాకు దిగారు. గ్రామస్తుల ఆందోళనకు వైఎస్ షర్మిల మద్ధతు తెలిపారు. చొప్పదండి, మంచిర్యాల ప్రధాన రహదారిపై గ్రామస్తులతో కలిసి ఆమె నిరసన తెలియజేశారు. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు షర్మిల బయలుదేరారు. కరీంనగర్ లో షర్మిలకు పార్టీ కార్యకర్తలు, స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఆదిలాబాద్ వెళుతుండగా గ్రామస్తులు ధర్నా చేస్తుండటంతో షర్మిల వారికి మద్దతు తెలిపారు.