నీరా టేస్ట్ చేసిన షర్మిల

నీరా టేస్ట్ చేసిన షర్మిల

జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. ప్రజా ప్రస్థానం యాత్రలో భాగంగా నీరా టెస్ట్ చేశారు. లక్ష్మీనారాయణపురం స్టేజి వద్ద ఓ కల్లు గీత కార్మికుని కోరిక మేరకు నీరాను రుచి చూశారు. తనకు అలవాటు లేదని చెప్పిన షర్మిల.. గీత కార్మికుడి విజ్ఞప్తితో కొద్దిగా నీరాను తాగారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే కల్లు గీత కార్మికులకు పెద్ద పీట వేస్తామని హామీ ఇచ్చారు. 

భారీ బందోబస్తు 

ఇవాళ పాలకుర్తి నియోజకవర్గంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతోంది. మరోవైపు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్ర కూడా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తుగా పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. దేవరుప్పుల మండలంలోని దుకాణాలను మూసివేయించారు. డ్రోన్ కెమెరాలతో పరిస్థితులను పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. పాలకుర్తి నియోజకవర్గం నుంచి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.