ముఖ్యమంత్రి కేసీఆర్ పై మండి పడ్డారు తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. రైతుల ఇళ్లు బంగారు వాసాలు చేస్తానన్న దొర.. రైతులు అదే వాసాలకు ఉరివేసుకుంటుంటే.. ఆదుకోవడం చేతకావడం లేదని విమర్శించారు. కానీ దొరగారికి రాజకీయ డ్రామాల కోసం ఉత్తరాది రైతులకు డబ్బులు ఇవ్వడానికి చేతనౌతుందని మండిపడ్డారు. ఇక్కడి నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకొంటుంటే .. నోటిఫికేషన్స్ ఇవ్వడం చేతకాని దొరకు తన కుటుంబానికి పదవులు ఇచ్చుకోవడానికి చేతనౌతుందని విమర్శించారు.
ధాన్యంకుప్పల పైనే రైతుల గుండెలు ఆగిపోయాయి కానీ
— YS Sharmila (@realyssharmila) November 22, 2021
మీ గుండెలు కరుగటం లేదు.
ఉత్తరాదిలో చనిపోయిన రైతులకు లక్షల సాయం చేస్తున్న మీకు తెలంగాణ రైతుకష్టాలు కానొస్తలేవు.
కొనుగోలు కేంద్రాల్లో రైతు కన్నీళ్లు ఆవిరికాకముందే,
మన రైతుల ప్రాణాలు పోకముందే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మా డిమాండ్ 2/2
రైతులు చస్తుంటే ఆదుకోవడం చేతకాని మీరు రైతు నేస్తం అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి అని షర్మిల ధ్వజమెత్తారు. విద్యార్థుల త్యాగాల మీద పదవులను అనుభవిస్తూ వారిని ఆత్మహత్యల బాట పట్టిస్తున్నందుకు మీ గుండెలు రాతి బండలు అయ్యుండాలి అని విమర్శించారు. నిరుద్యోగుల కోసం షర్మిల పార్టీ తరపున ప్రతీ మంగళవారం నిరుద్యోగ దీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ కారణంగా ఆమె తన దీక్షను వాయిదా వేసుకున్నారు.
తన కుటుంబానికి పదవులు ఇచ్చుకోవడానికి చేతనౌతుంది. రైతులు చస్తుంటే ఆదుకోవడం చేతకాని మీరు రైతు నేస్తం అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి. విద్యార్థుల త్యాగాల మీద పదవులను అనుభవిస్తూ వారిని ఆత్మహత్యల బాట పట్టిస్తున్నందుకు మీ గుండెలు రాతి బండలు అయ్యుండాలి.2/2#ShamelessKCR #HeartlessKCR
— YS Sharmila (@realyssharmila) November 23, 2021